News December 3, 2025

SDPT: 4 లైన్లకు నేడు సీఎం శంకుస్థాపన

image

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.

Similar News

News February 16, 2026

బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు గ్రాండ్ వెల్కమ్

image

AP: అమరావతి పర్యటనకు వచ్చిన బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద గేట్స్‌కు పుష్పగుచ్ఛం అందించి వెల్కమ్ చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌తో బిల్‌గేట్స్ భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చించనున్నారు.

News February 16, 2026

అనకాపల్లిలో ఒంటరి మహిళ సజీవ దహనం

image

అనకాపల్లి పట్టణంలోని గూడ్స్ రోడ్డు వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైల్వే ప్రహరీకు ఆనుకుని ఉన్న ఒక రేకుల షెడ్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ నివసిస్తున్న లింగాల తలుపులమ్మ (45) అనే ఒంటరి మహిళ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. చలి కారణంగా వేడి కోసం వెలిగించిన కుంపటి వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ అధికారులు, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

News February 16, 2026

పార్వతీపురం: బస్సు అంటే భయం!

image

ఒడిశా ఆర్టీసీ బస్సులలో ప్రయాణంపై జిల్లా ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలే దీనికి కారణం. నిత్యం ఒడిశా నుంచి ఆంధ్రాకు రాత్రి పూట ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. పి.కొనవలస ఘాట్ రోడ్డులో అత్యధిక మలుపులు కారణంగా బస్సులో సాంకేతిక సమస్యలు వచ్చి ప్రమాదాలకు కారణంగా భావిస్తున్నారు. గత మూడు నెలల క్రితం ఒక బస్సు దగ్ధం అవ్వగా, నిన్న సాలూరులో బస్సు బోల్తా పడింది.