News April 13, 2024
ఈమె మామూలు మహిళ కాదు

భారీ స్కామ్లో మరణశిక్ష పడిన వియత్నాం సంపన్న <<13034140>>మహిళ<<>> ట్రూంగ్ మై లాన్ తెలివితేటలు ఆర్థిక నిపుణులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. వందలకొద్దీ షెల్ కంపెనీలు, డజన్లకొద్దీ బినామీలతో ఆమె SCB బ్యాంకులో తప్పుడు పత్రాలు సమర్పించి 12.5బిలియన్ డాలర్లను విత్డ్రా చేశారు. అధికారులకు ఇష్టమొచ్చినట్లు లంచాలు ఇచ్చారు. విత్డ్రా చేసిన ఆ రెండు టన్నుల బరువున్న నగదును ఇంటి బేస్మెంట్లో భద్రపరచడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.
Similar News
News December 5, 2025
కష్టాలకు తలొగ్గవద్దు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది: కేసీఆర్

TG: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని కార్యకర్తలకు మాజీ సీఎం KCR సూచించారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులు, వార్డు సభ్యులు ఆయనను కలిశారు. BRS అధినేత వారిని సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా KCR మాట్లాడుతూ ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. పల్లెలకు మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అధైర్యపడకుండా ముందుకు నడవాలి’ అని చెప్పారు.
News December 5, 2025
రాహుల్, ఖర్గేను కాదని శశిథరూర్కు ఆహ్వానం

రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో జరిగే ప్రత్యేక విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను కేంద్రం ఆహ్వానించింది. విదేశీ ప్రతినిధులు భారత్లో పర్యటించినప్పుడు అపోజిషన్ లీడర్లను పిలిచే సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుతిన్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఇస్తున్న ఈ విందుకు కాంగ్రెస్ నేత రాహుల్, AICC ప్రెసిడెంట్ ఖర్గేను ఆహ్వానించలేదు.
News December 5, 2025
ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్ రావు

TG: బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో <<18478689>>సాయి ఈశ్వర్<<>> బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని హరీశ్రావు చెప్పారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ‘ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.


