News March 27, 2024
ప్రియుడి❤️ కోసం రూ.25వేల కోట్లు వదిలేసింది

ఓ యువతి తన ప్రియుడి కోసం రూ.వేల కోట్ల సంపదను తృణప్రాయంగా వదిలేశారు. మలేషియాకు చెందిన బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె ఏంజెలిన్ ఫ్రాన్సిస్ ఆక్స్ఫర్డ్ వర్సిటీలో చదివారు. ఆ సమయంలో జెడిడియాను ప్రేమించారు. కానీ వారి పెళ్లికి ఏంజెలిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రూ.వేల కోట్ల ఆస్తి కావాలో.. బాయ్ఫ్రెండ్ కావాలో తేల్చుకోమన్నారు. కానీ తన వాటా రూ.25 వేల కోట్లను ఆమె వదిలేసుకుని ప్రియుడిని పెళ్లాడారు.
Similar News
News February 17, 2026
₹34,855 కోట్లు.. సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బు ఇది!

దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆన్లైన్ ఫ్రాడ్తో నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ₹34,855 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. అందులో ₹12,230 కోట్లను అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సైబర్ నేరాలపై నమోదైన 234 కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్ గేమింగ్, క్రిప్టో కరెన్సీ, లోన్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్టులతో దోచుకుంటున్నట్లు వెల్లడించారు.
News February 17, 2026
‘ఫర్టిగేషన్’లో ఎలాంటి ఎరువులను అందించే అవకాశం ఉంటుంది?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.
News February 17, 2026
418 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


