News April 12, 2025

రొయ్యల మేత ధర కిలోకు రూ.4 తగ్గింపు

image

AP: పెరిగిన ఖర్చులు, ఎగుమతి కౌంట్ రేట్లు తగ్గిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు ₹4 చొప్పున ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. <<16027501>>సీఎం చంద్రబాబు<<>> ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నేటి నుంచి అమలు చేస్తామని వెల్లడించాయి. అయితే కిలోకు ₹20-25 తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా రొయ్యల ధరలను తగ్గించొద్దని వ్యాపారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

Similar News

News January 19, 2026

ఐఐటీ ఢిల్లీలో పోస్టులు

image

<>IIT <<>>ఢిల్లీ 17 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు JAN 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, PhD (సైన్స్/ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్- 2కు నెలకు రూ.67K+HRA, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 3కి రూ.78K+HRA, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌కు రూ.28K చెల్లిస్తారు. సైట్: https://ird.iitd.ac.in

News January 19, 2026

నేటి నుంచి మాఘ మాసం

image

మాఘమాసం ఆధ్యాత్మిక, ఆరోగ్యపరంగా ఎంతో విశిష్టమైనది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండటం వల్ల దీనికి మాఘం అనే పేరు వచ్చింది. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, సూర్యుడిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అక్షరాభ్యాసం, వివాహం వంటి శుభకార్యాలకు ఇదెంతో అనువైన సమయం. ఈ మాసమంతా విష్ణుసహస్రనామ పారాయణ, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు.

News January 19, 2026

న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి.. షమీ ఉండాల్సిందేమో!

image

న్యూజిలాండ్‌తో సిరీస్ కోల్పోయి టీమ్ ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ముఖ్యంగా NZ ప్లేయర్ మిచెల్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. సిరీస్‌లో అతను 352 పరుగులతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు స్టార్ బౌలర్ షమీని గుర్తు చేస్తున్నారు. అతడు ఉండుంటే మిచెల్ ఆటలు సాగేవి కావని, గత రికార్డులే అందుకు నిదర్శనమని అంటున్నారు. ఇరువురి మధ్య పోరులో 16 సగటుతో 4 సార్లు ఔట్ చేసి షమీ ఆధిపత్యం ప్రదర్శించారు.