News June 21, 2024

గణనీయంగా పెరిగిన దుర్గగుడి రోజువారీ ఆదాయం: ఈవో

image

AP: విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి రోజువారీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగిందని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 16 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా రూ.3,23,75,523 లభించినట్లు తెలిపారు. సగటున రోజుకు రూ.20,23,470లు కానుకల రూపంలో వచ్చాయని పేర్కొన్నారు. బంగారం 694 గ్రాములు, వెండి 6కిలోల 264 గ్రాములు వచ్చాయన్నారు. ఆన్‌లైన్ ఈ హుండీ ద్వారా రూ.59,380ల ఆదాయం సమకూరినట్లు చెప్పారు.

Similar News

News January 23, 2026

2 వారాలు షుగర్ మానేస్తే మ్యాజిక్ రిజల్ట్స్!

image

స్వీట్లు, కూల్ డ్రింక్స్‌ వంటి వాటిలోని చక్కెర మన బాడీని పాడు చేస్తోందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పారు. కేవలం 14 రోజులు షుగర్ మానేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు. ‘ముఖంలో వాపు తగ్గి గ్లో వస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గి పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది. ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయమవుతాయి. హెల్తీ స్కిన్ కోసం ఇదో బెస్ట్ టిప్’ అని సూచించారు.

News January 23, 2026

స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 49 పోస్టులకు నోటిఫికేషన్

image

అహ్మదాబాద్‌లోని <>స్పేస్ <<>>అప్లికేషన్ సెంటర్ 49 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, ME/MTech/MSc/MS, BE/BTech ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sac.gov.in/

News January 23, 2026

లక్ష్మీదేవి కొలువై ఉండే పదార్థాలు ఇవే..

image

శాస్త్రాల ప్రకారం పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, వీటిని గౌరవిస్తూ ఇల్లు శుభ్రంగా ఉంచుకునే వారిపై ఆమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఈ వస్తువుల పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సోమరితనం, కలహాలు ఉన్న చోట లక్ష్మి నిలవదని చెబుతున్నారు. వాటి పట్ల గౌరవంగా వ్యవహరిస్తే సంపద, ఐశ్వర్యం నిలకడగా ఉంటాయి.