News April 23, 2025
SKLM: క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన DIG

విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల జిల్లాల ఎస్పీలతో DIG గోపినాథ్ జెట్టి క్రైమ్ రివ్యూ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై నియంత్రణ కోసం చెక్పోస్ట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు.
Similar News
News March 11, 2026
శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.
News March 11, 2026
కోడి పందేల శిబిరంపై దాడి: నరసన్నపేట ఎస్సై

నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలోని వంశధార నది పరివాహక ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నామని ఎస్సై బి.గణేశ్ తెలిపారు. ఈ మేరకు తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడి చేశామని వెల్లడించారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.10,700 స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.
News March 11, 2026
SKLM: ‘ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి’

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మడు రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.


