News December 3, 2025
SKLM: ‘ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీస్ తప్పనిసరి’

వచ్చే వారానికి జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పరంగా వివిధ శాఖల దస్త్రాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్థికపరమైన దస్త్రాల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో వెనుకబడిన అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News February 7, 2026
ఎచ్చెర్ల: అందుబాటులో 16 పీజీ కోర్సులు

పీజీ కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో గత ఏడాది 16 కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ఈ పీజీ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డికి అడ్డయ్య కోరారు.
News February 7, 2026
అర్హత గల ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో అర్హతగల ప్రతి పేదవానికి పక్కాఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం సంతబొమ్మాళి మండలం నౌపడ కూడలి వద్ద పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేసారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే CM ధ్యేయం అన్నారు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, AMC ఛైర్మన్ బీ.వెంకటరమణమ్మ, తహశీల్దార్ హేమసుందర్ రావు పాల్గొన్నారు.
News February 7, 2026
అర్హత గల ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో అర్హతగల ప్రతి పేదవానికి పక్కాఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం సంతబొమ్మాళి మండలం నౌపడ కూడలి వద్ద పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేసారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే CM ధ్యేయం అన్నారు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, AMC ఛైర్మన్ బీ.వెంకటరమణమ్మ, తహశీల్దార్ హేమసుందర్ రావు పాల్గొన్నారు.


