News September 12, 2025
SKLM: రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్కు పలువురు రైతులు ఫోన్ చేసి తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. రైతుల వివిధ రకాల సమస్యలను తెలుసుకుని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్కి తీసుకొని ఎరువులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News December 12, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

◈SKLM: పొందూరు ఖాధీకి భౌగోళిక గుర్తింపు
◈యూరియా నిల్వలను రైతులు వినియోగించుకోండి
◈జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే కూన
◈లావేరు: రాళ్ళ దారిలోనే ప్రయాణం
◈శ్రీకాకుళం: ఏపీ ఎన్జీవో ఎన్నికలు ఏకగ్రీవం
◈టెక్కలి: అంగన్వాడీలకు 5జీ మొబైల్స్ వచ్చేశాయి
◈శ్రీకాకుళంలో అంగన్వాడీల ధర్నా
◈ఎచ్చెర్ల: నోటిఫికేషన్లు వేశారు.. నియామకాలు మరిచారు
News December 12, 2025
శ్రీకాకుళం జిల్లాలో తెరుచుకోని అంగన్వాడీ కేంద్రాలు

శ్రీకాకుళం జిల్లాలోని 3,385 అంగన్వాడీ కేంద్రాలు శుక్రవారం తెరుచుకోలేదు. తమ సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో సిబ్బంది విధులను బహిష్కరించారు. ప్రధానంగా కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, FRS రద్దు తదితర ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నాలో పాల్గొనున్నారు.
News December 12, 2025
ఎచ్చెర్ల: యూనివర్సిటీలో జాతీయ సదస్సు

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈనెల 18, 19 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బి.ఆర్.ఏ.యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశంలో విజ్ఞాన సమపార్జన, సంస్కృతి అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. విద్యారంగ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు.


