News November 19, 2025
SRCL: “CESS”లో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ సోదాలు

కో- ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ LTD SRCL ఆఫీస్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, సెస్ కార్యకలాపాలకు సంబంధించి రికార్డులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. CESS కార్యాలయ సిబ్బంది నుంచి పలు రికార్డులు, FILES స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ చేసిన తర్వాత ఉన్నతాధికారులకు REPORT పంపనున్నారు.
Similar News
News January 23, 2026
MBNR: MVSలో ఉద్యోగమేళా..164 మంది ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉద్యోగమేళా నిర్వహించారు. ఇందులో 164 మంది విద్యార్థులు 18 కంపెనీలలో ఉద్యోగ అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను ప్రిన్సిపల్ డా.కె. పద్మావతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ కో ఆర్డినేటర్ సూర్యనారాయణ, అకాడమిక్ కో ఆర్డినేటర్ రవీందర్, టీఎస్ కేసీ మెంటర్ తేజస్విని, అధ్యాపకులు పాల్గొన్నారు.
News January 23, 2026
ఉత్తమ్పై CM నిఘా అని వార్తలు.. మంత్రి క్లారిటీ

TG: CM రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి, ఉత్తమ్పై నిఘా పెట్టి దావోస్ వెళ్లారని ఓ SM పేజ్లో వచ్చిన వార్తపై ఉత్తమ్ కుమార్ స్పందించారు. అందులో అసలు నిజం లేదని పేర్కొన్నారు. ఆ వార్త సారాంశం ఏంటంటే.. ‘మంత్రులు vs CM పంచాయితీ హైకమాండ్కు చేరింది. మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్ను 12మంది MLAలు కలిశారు. CM ఇద్దరు మంత్రులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి వెళ్లారు’ అని వచ్చిన వార్తను మంత్రి ఖండించారు.
News January 23, 2026
మేడారం జాతరకు మంచిర్యాల నుంచి ప్రత్యేక రైలు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే భక్తులకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. రైలు నం.07496 మంచిర్యాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈనెల 28,29,30, ఫిబ్రవరి 1 వరకు రైలు నడుస్తుందన్నారు. స్పెషల్ రైలు మధ్యాహ్నం 3:30కి మంచిర్యాలలో బయలుదేరి రాత్రి 10:10 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరక వెళ్లే భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


