News May 13, 2024

పోలింగ్‌లో శ్రీనగర్ కొత్త రికార్డు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీనగర్‌లో ఈరోజు పోలింగ్ జరిగింది. రాత్రి 8గంటలకు 36.58% పోలింగ్ నమోదైంది. 1998 తర్వాత ఇదే అత్యధికమని ఎన్నికల సంఘం తెలిపింది. 1996లో 40.94% రాగా.. 1998లో 30.06% నమోదైంది. 1999లో 11.93%, 2004లో 18.57% 2009లో 25.55%, 2014లో 25.86%, 2019లో 14.43% పోలింగ్ జరిగింది. అక్కడ మొత్తం 17.48లక్షల ఓటర్లున్నారు.

Similar News

News December 13, 2025

కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>నేషనల్ <<>>హెల్త్ మిషన్ కాకినాడ జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో 35 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, PG, PGDCA, బీఫార్మసీ, డీఫార్మసీ, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 15- 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, STలకు రూ.200. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

News December 13, 2025

టెన్త్ అర్హతతో 714 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

image

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-27 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం ₹18,000-₹56,900 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/

News December 13, 2025

బత్తాయిలో ఆకుముడత, మంగునల్లి కట్టడికి జాగ్రత్తలు

image

☛ బత్తాయిలో ఆకుముడత పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ బత్తాయిలో మంగునల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 3ml లేదా ప్రాపర్ జైట్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.