News May 23, 2024

SRPT:పోస్టల్ బ్యాలెట్ కు రేపే చివరి రోజు: కలెక్టర్

image

MLC ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ వెంకట్రావు,ఆదనపు కలెక్టర్ ప్రియాంకతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 182 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని తెలిపారు. రేపే చివరి రోజు అని తెలిపారు.

Similar News

News March 13, 2026

టెన్త్‌ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

జిల్లాలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 13, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలి: కలెక్టర్

image

నూతన ప్రజాప్రతినిధులు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

News March 13, 2026

NLG: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 13,981 మంది హ్యాపీ

image

జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారంతో విజయవంతంగా ముగిశాయి. ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లతో ఈ పరీక్షల పర్వం దిగ్విజయంగా పూర్తి కావడంతో విద్యార్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 11,783 మంది, వొకేషనల్ విభాగంలో 2,248 మంది.. మొత్తం 13,981 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన ప్రతిఒక్కరికీ డీఐఈఓ ధన్యవాదాలు తెలిపారు.