News September 12, 2025
SRPT: ‘జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి’

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ గురువారం కోరారు. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్నీ కేసుల్లో కక్షిదారులు రాజీ పడవచ్చన్నారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి రాజీమార్గమే రాజమార్గమన్నారు. ఇందుకు లోక్ అదాలత్ ఓ మంచి వేదికన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 7, 2025
ఈ నెల 10 నుంచి టెట్ పరీక్షలు: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.
News December 7, 2025
సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు

మెదక్లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలో పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ రోజు బయలుదేరి వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఏ.ముత్యం రావు, తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 9 వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపకల్పన చేస్తారని తెలిపారు.
News December 7, 2025
గోపా పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా సర్వసభ్య సమావేశం జ్యోతినగర్ ఏరియాలో ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా మండ రమేష్, ప్రధాన కార్యదర్శిగా బందారపు యాదగిరి, కోశాధికారిగా కొక్కిస దేవేందర్, ఉపాధ్యక్షులు వీరగోని శ్రీనివాస్, అడ్డగుంట రాజేందర్, బాలసాని స్వామి, మేడగోని రాజమౌళితోపాటు పలువురిని ఎన్నుకున్నారు.


