News August 9, 2024

SRPT: GREAT.. 4 GOVT JOBS సాధించింది!

image

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతదొనబండ తండా వాసి భూక్యా మౌనిక ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె HYD దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ స్థానికంగా ఉండే పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఆమె చదువుకుంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఆరో ర్యాంకు, TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ AEE, 2023లో రైల్వేలో క్యారేజ్ అండ్ వ్యాగన్, లెవల్-3లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ జాబ్స్ సాధించింది.

Similar News

News December 15, 2025

MLG: రెండో విడతలో తగ్గిన పోలింగ్ శాతం

image

మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో NLG, CDR రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో MLG డివిజన్ లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది.

News December 15, 2025

పెద్దవూర: మూడు ఓట్లతో ఇండిపెండెంట్ విజయం

image

పెద్దవూర మండలం సంగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెంటెండ్ ఈసం రమేష్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన మాతంగి శ్రీనయ్య మీద 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి సేవ చేస్తా అని అన్నారు.

News December 14, 2025

త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

image

బృందావనపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.