News February 9, 2025
చివరి మ్యాచ్ ఆడేసిన స్టార్ క్రికెటర్ కరుణరత్నే

శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టుతో ఆయన క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ మ్యాచులో ఆయన 36, 14 పరుగులు చేశారు. లంక తరఫున కరుణరత్నే 100 టెస్టుల్లో 7,222 పరుగులు, 50 ODIల్లో 1,316 రన్స్ చేశారు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో రాణించారు. 30 టెస్టులకు కెప్టెన్గానూ వ్యవహరించారు. 2011లో ఆయన అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.
Similar News
News March 23, 2025
ముంబై టీమ్లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో రాయలసీమ కింగ్స్కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.
News March 23, 2025
రాష్ట్రంలో 8 మంది మృతి

TG: రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట (D) బీబీగూడెం వద్ద కారు-బస్సు ఢీకొన్నాయి. ఘటనలో కారులోని భార్యాభర్త, పాప(8), మరొకరు చనిపోయారు. మృతుల్లో రవి, రేణుక, రితికను గుర్తించారు. అలాగే, హనుమకొండ- కరీంనగర్ NHపై హసన్పర్తి పెద్దచెరువు వద్ద టూవీలర్ను టిప్పర్ ఢీకొట్టగా పవన్, మహేశ్ మృతిచెందారు. నల్గొండ (D) ఏపూరులో ఈతకు వెళ్లి నవీన్(23), రాఘవేంద్ర(20) నీటమునిగి చనిపోయారు.
News March 23, 2025
రోహిత్ డకౌట్

IPL-2025: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబైకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. ఖలీల్ బౌలింగ్లో మిడ్ వికెట్ ఫీల్డర్ శివమ్ దూబేకు ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో రికెల్టన్, విల్ జాక్స్ ఉన్నారు.