News February 27, 2025
Stock Markets: బ్యాంకు షేర్లు అదుర్స్

గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో బెంచ్మార్క్ సూచీలు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,545 (-2), సెన్సెక్స్ 74,612 (10) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు నిఫ్టీ 135 Pts పెరిగి 48,743 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లు ఎగిశాయి. ఆటో, మీడియా, PSU బ్యాంకు, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు ఎరుపెక్కాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్, హిందాల్కో, సన్ఫార్మా టాప్ గెయినర్స్.
Similar News
News February 27, 2025
ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.
News February 27, 2025
P4కు అర్హులు ఎవరు?

AP: P4 కార్యక్రమం అమలు చేయనున్న ప్రభుత్వం సచివాలయాల డేటా, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను గుర్తించనుంది. 2 ఎకరాల మాగాణి/5 ఎకరాల మెట్ట భూమి, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్, ఫోర్ వీలర్స్ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడేవారు అర్హులు కారు. ప్రస్తుతం 10 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే చేస్తుండగా, మార్చి 18 నాటికి మిగతా జిల్లాల్లో సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించనుంది.
News February 27, 2025
EAPCET ప్రవేశాల్లో సవరణలు

తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు <