News October 5, 2025
పెళ్లైన వారానికే సూసైడ్.. కారణమిదే!

TG: జగిత్యాల జిల్లా ఎర్దండిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న గంగోత్రి(22) వారానికే <<17908971>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. దసరా పండుగ రోజు భార్య గంగోత్రితో కలిసి భర్త సంతోష్ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మటన్ తింటూ కూరలో కారం లేదని గంగోత్రిని భర్త తిట్టాడు. ఆపై భోజనం చేయకుండా భార్యతో ఇంటికి వచ్చేశాడు. ఈ కారణంతోనే మనస్తాపం చెంది యువతి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 23, 2026
భూమనపై రమణ విమర్శలు

విజయసాయిరెడ్డి నమ్మినవారికి వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడని, దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని టీటీడీ మాజీ సభ్యుడు ఓ.వి.రమణ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి కరుణానంద స్వామిలా మారి శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి YCPకి రాజీనామా చేయడం జగన్ ఆడుతున్న డ్రామా అని, BJPలో చేరి కూటమిని విచ్ఛిన్నం చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
News January 23, 2026
2 వారాలు షుగర్ మానేస్తే మ్యాజిక్ రిజల్ట్స్!

స్వీట్లు, కూల్ డ్రింక్స్ వంటి వాటిలోని చక్కెర మన బాడీని పాడు చేస్తోందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పారు. కేవలం 14 రోజులు షుగర్ మానేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు. ‘ముఖంలో వాపు తగ్గి గ్లో వస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గి పొట్ట ఫ్లాట్గా మారుతుంది. ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయమవుతాయి. హెల్తీ స్కిన్ కోసం ఇదో బెస్ట్ టిప్’ అని సూచించారు.
News January 23, 2026
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో 49 పోస్టులకు నోటిఫికేషన్

అహ్మదాబాద్లోని <


