News March 27, 2024

చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

image

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలోనే 148/2 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో 148 పరుగులు బాదిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఆ తర్వాత ముంబై 131/3 (2021), పంజాబ్ 131/3 (2014), డెక్కన్ ఛార్జర్స్ 130/0 (2008), బెంగళూరు 129/0 (2016), బెంగళూరు 128/0 (2013), లక్నో 128/2 (2023), చెన్నై 128/2 (2015) ఉన్నాయి.

Similar News

News February 19, 2026

ఆ షుగర్ టెస్టుపైనే ఆధారపడొద్దు: లాన్సెట్

image

షుగర్ లెవల్స్ చెక్ చేసేందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న HbA1c టెస్టునే ప్రామాణికంగా తీసుకోవద్దని లాన్సెట్ జర్నల్ సూచించింది. ఈ టెస్టులో ఎర్రరక్త కణాల్లో (RBC) కలిసే చక్కెర స్థాయి లెక్కిస్తారు. అయితే ‘రక్తహీనత, ఇతర బ్లడ్ సమస్యలు సాధారణమైన భారత ప్రజల్లో RBCలు విచ్ఛిన్నం అవుతాయి. దీంతో ఎక్కువ కణాలు ఉన్నట్లు కన్పించి ఫలితం తప్పుగా వస్తోంది. ఫలితంగా డయాబెటిస్ ఉన్నా, తెలియడం లేదు’ అని పేర్కొంది.

News February 19, 2026

చైనా రోబో డాగ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన గల్గోటియాస్

image

చైనా <<19173893>>రోబో డాగ్‌<<>> తమ ఆవిష్కరణగా చెప్పుకుని విమర్శలపాలైన గల్గోటియాస్ యూనివర్సిటీ క్షమాపణలు తెలిపింది. ‘రోబో డాగ్ సాంకేతిక మూలాల గురించి మా ప్రతినిధికి తెలియదు. కెమెరా ఎదుట ఉత్సాహంతో తప్పుడు సమాచారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణపై తప్పుదోవ పట్టించడం మా ఉద్దేశం కాదని అర్థం చేసుకోగలరు. నిర్వాహకుల మనోభావాలను అర్థం చేసుకుని మేం ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేశాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది.

News February 19, 2026

ఛత్రపతి: వీరత్వ పతాక.. ధీరత్వ ప్రతీక

image

శివాజీ చక్రవర్తి.. ఈ పేరు వింటే శత్రువులపై విరుచుకుపడిన వీరత్వం, రాజ్యాలను జయించిన ధీరత్వం గుర్తొస్తాయి. మొఘలులు, దక్కన్ సుల్తానుల మధ్య నలిగే ప్రజలకు విముక్తి కలగాలన్న తల్లి జిజియాబాయి మాటలతో రాజ్య స్థాపనపై బాల్యంలోనే కలగన్నారు. తల్లి నేర్పిన పురాణ గాథల బోధనల బుద్ధితో పాటు యుద్ధ విద్యలతో పరాయి పాలనలోని కోటలను బద్దలు కొట్టి మహారాష్ట్రలో మరాఠా జెండా ఎగురవేశారు. ఆ ఛత్రపతి జయంతి నేడు (19 feb 1630).