News March 26, 2024
పెండింగ్ స్థానాల్లో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే

టీడీపీ పెండింగ్లో ఉంచిన స్థానాల్లో IVRS సర్వేలు చేపడుతోంది. విజయనగరం MP సీటు కోసం ముగ్గురి పేర్లు తెరపైకి తెచ్చారు. విజయనగరం అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ మీసాల గీత, ఎచ్చెర్ల సీటు ఆశిస్తున్న అప్పలనాయుడుతో పాటు కంది చంద్రశేఖర్ పేరుతో సర్వే చేస్తున్నారు. ఇటు కడప MP సీటు కోసం శ్రీనివాసులు రెడ్డి, భూపేశ్ రెడ్డి, వీరశివారెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. ఒంగోలు, అనంతపురం ఎంపీ సీట్లూ పెండింగ్లో ఉన్నాయి.
Similar News
News February 19, 2026
ఆ షుగర్ టెస్టుపైనే ఆధారపడొద్దు: లాన్సెట్

షుగర్ లెవల్స్ చెక్ చేసేందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న HbA1c టెస్టునే ప్రామాణికంగా తీసుకోవద్దని లాన్సెట్ జర్నల్ సూచించింది. ఈ టెస్టులో ఎర్రరక్త కణాల్లో (RBC) కలిసే చక్కెర స్థాయి లెక్కిస్తారు. అయితే ‘రక్తహీనత, ఇతర బ్లడ్ సమస్యలు సాధారణమైన భారత ప్రజల్లో RBCలు విచ్ఛిన్నం అవుతాయి. దీంతో ఎక్కువ కణాలు ఉన్నట్లు కన్పించి ఫలితం తప్పుగా వస్తోంది. ఫలితంగా డయాబెటిస్ ఉన్నా, తెలియడం లేదు’ అని పేర్కొంది.
News February 19, 2026
చైనా రోబో డాగ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన గల్గోటియాస్

చైనా <<19173893>>రోబో డాగ్<<>> తమ ఆవిష్కరణగా చెప్పుకుని విమర్శలపాలైన గల్గోటియాస్ యూనివర్సిటీ క్షమాపణలు తెలిపింది. ‘రోబో డాగ్ సాంకేతిక మూలాల గురించి మా ప్రతినిధికి తెలియదు. కెమెరా ఎదుట ఉత్సాహంతో తప్పుడు సమాచారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణపై తప్పుదోవ పట్టించడం మా ఉద్దేశం కాదని అర్థం చేసుకోగలరు. నిర్వాహకుల మనోభావాలను అర్థం చేసుకుని మేం ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేశాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది.
News February 19, 2026
ఛత్రపతి: వీరత్వ పతాక.. ధీరత్వ ప్రతీక

శివాజీ చక్రవర్తి.. ఈ పేరు వింటే శత్రువులపై విరుచుకుపడిన వీరత్వం, రాజ్యాలను జయించిన ధీరత్వం గుర్తొస్తాయి. మొఘలులు, దక్కన్ సుల్తానుల మధ్య నలిగే ప్రజలకు విముక్తి కలగాలన్న తల్లి జిజియాబాయి మాటలతో రాజ్య స్థాపనపై బాల్యంలోనే కలగన్నారు. తల్లి నేర్పిన పురాణ గాథల బోధనల బుద్ధితో పాటు యుద్ధ విద్యలతో పరాయి పాలనలోని కోటలను బద్దలు కొట్టి మహారాష్ట్రలో మరాఠా జెండా ఎగురవేశారు. ఆ ఛత్రపతి జయంతి నేడు (19 feb 1630).


