News April 14, 2024

సీఎం జగన్‌పై టీడీపీ సెటైరికల్ ట్వీట్

image

AP: నిన్న బస్సు యాత్రలో సీఎం జగన్ మీద దాడి జరగడంపై టీడీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘నటనకు నవత తరగని యువత, నీ రస హృదయం రాయని కవిత, అభినయ సిరి‌గా అభినవ గిరి‌గా, వచ్చాడు రస రాజు, నిన్ను చూసి మెచ్చాడు నటరాజు’ అని దశావతారం సినిమాలోని పాట లిరిక్స్‌ను ట్వీట్ చేసింది. దీంతో పాటు 2019లో కత్తి గాయం, 2024లో రాయి దాడి ఫొటోలను షేర్ చేసింది. జగన్ నటనకు అవార్డు ఇవ్వాలంటూ ఎద్దేవా చేసింది.

Similar News

News December 17, 2025

రూ.లక్షకు రూ.73లక్షల వడ్డీ.. కిడ్నీ అమ్ముకున్న రైతు

image

వ్యవసాయంలో నష్టాలతో పాల వ్యాపారం చేద్దామనుకున్న రైతు కిడ్నీ అమ్ముకున్న విషాద ఘటన MHలో జరిగింది. చందాపూర్(D)కు చెందిన కుడే అనే రైతు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. లాభాలు రాకముందే ఆవులు చనిపోయాయి. రోజుకు రూ.10వేల వడ్డీ వేయడంతో అప్పు రూ.74లక్షలకు చేరింది. పొలం, ట్రాక్టర్ అమ్మినా అప్పు తీరలేదు. దీంతో వ్యాపారుల సలహాతో కుడే కంబోడియా వెళ్లి రూ.8లక్షలకు కిడ్నీ అమ్మి వారికి చెల్లించాడు.

News December 17, 2025

ధనుర్మాసం: ఏయే పూజలకు ఏయే ఫలితాలు?

image

ధనుర్మాసంలో వైష్ణవాలయాన్ని దర్శించాలని పండితులు సూచిస్తున్నారు. గంధాన్ని భక్తులకు పంచితే మంచి జరుగుతుందని అంటున్నారు. అగ్నిపురాణం ప్రకారం.. ఆలయానికి శక్తి కొలది దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. సంపంగి పూలతో విష్ణును పూజిస్తే కుజదోషం పోతుంది. ఏజ్ పెరిగినా.. పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. తెల్లగన్నేరు పూలతో స్వామిని అర్చిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.

News December 17, 2025

నేడే మూడో విడత పోలింగ్

image

TG: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 12,652 మంది, వార్డుల బరిలో 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి విడతలో 53,06,395 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల వేళ రూ.9.11 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు.