News October 7, 2024
HK6 టోర్నీలో పాల్గొననున్న టీమ్ఇండియా

నవంబర్ 1 నుంచి జరిగే హాంగ్ కాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీ-2024లో భారత జట్టు పాల్గొనబోతోంది. ఈ టోర్నీకి ఇది 20వ ఎడిషన్ కాగా, గతంలో సచిన్, ధోనీ వంటి ప్లేయర్లు కూడా ఇందులో ఆడారు. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఇన్నింగ్స్కు 5 ఓవర్లు, టీమ్కు ఆరుగురు సభ్యులుంటారు. 3 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పాకిస్థాన్ కూడా పాల్గొంటోంది. మన టీమ్ నుంచి ఎవరెవరు ఆడితే బాగుంటుందో కామెంట్ చేయండి.
Similar News
News December 7, 2025
37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.
News December 7, 2025
నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతోందా?

కొంతమందికి నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతుంటుంది. అయితే ఇది సాధారణం కాదంటున్నారు వైద్యులు. నిద్రలో నోటి నుంచి లాలాజలం కారడం కొన్ని వ్యాధులకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. సైనస్ ఇన్ఫెక్షన్, నిద్ర, నాడీ, గ్యాస్ట్రో సంబంధిత, దంతాలు లేదా చిగుళ్లలో సమస్యలకు సంకేతమని పేర్కొంటున్నారు. ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 6, 2025
నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.


