News March 12, 2025
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ ‘260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించింది. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
Similar News
News February 19, 2026
బెండలో పేనుబంకను ఎలా నివారించాలి?

బెండ పంటలో పేనుబంక లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలను తీసుకోవాలి. లేకుంటే పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. పేనుబంక నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్(3000 PPM) 300ML కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. అయినా ఉద్ధృతి తగ్గకపోతే 100 లీటర్ల నీటిలో థయోమిథాక్సాం 30 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 200mlను కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 19, 2026
హై బీపీ.. ఇలా తగ్గించుకోండి!

అధిక రక్తపోటు వల్ల గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హై BPని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ‘సోడియం ఎక్కువుండే ఫుడ్ తినొద్దు. పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్తో కూడిన ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. మద్యం అలవాటు ఉంటే మితంగా తాగండి. ధ్యానం/యోగాతో ఒత్తిడి తగ్గించుకోండి. క్రమం తప్పకుండా BP చెక్ చేసుకోండి. మందులు స్కిప్ చేయొద్దు’ అని చెబుతున్నారు.
News February 19, 2026
T20 WC: ఇవాళ 3 మ్యాచులు

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు వెస్టిండీస్- ఇటలీ, 3PMకు శ్రీలంక-జింబాబ్వే, 7PMకు అఫ్గాన్-కెనడా ఆడనున్నాయి. ఇప్పటికే సూపర్-8 జట్లు ఖరారు అయ్యాయి. దీంతో నేటి మ్యాచులు నామమాత్రమే. రేపు ఆస్ట్రేలియా-ఒమన్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈనెల 21 నుంచి సూపర్ 8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 22న సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా తలపడనుంది.


