News April 26, 2024
దేశంలోనే తొలి ఏకగ్రీవ ఎంపీ తెలుగోడే!

గుజరాత్లోని సూరత్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ముకేశ్ <<13102252>>ఏకగ్రీవంగా<<>> ఎన్నికవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే దేశంలో తొలి ఏకగ్రీవ ఎంపీ మన తెలుగోడే. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన TN విశ్వనాథరెడ్డి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. 1957లో రాజంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయగా, ఇతర పార్టీలేవీ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 16, 2026
వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

సోషల్ మీడియా, డేటింగ్ యాప్లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.
News April 16, 2026
మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.
News April 16, 2026
మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.


