News August 26, 2024

జోడెద్దులకు గుడి.. 15 ఏళ్లుగా పూజలు

image

AP: వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే ఎద్దులంటే రైతన్నలకు ఎంతో ప్రేమ. వాటిని కుటుంబసభ్యుల్లాగే భావిస్తారు. అవి చనిపోతే తల్లడిల్లిపోతారు. అన్నమయ్య(D) నరసాపురానికి చెందిన పెద్దప్పయ్యకు ఉన్న జోడెద్దులు 15ఏళ్ల కిందట చనిపోయాయి. వాటికి అంత్యక్రియలు చేసి, అక్కడే గుడి కట్టి విగ్రహాలను ఏర్పాటుచేశారు. రోజూ పూజలతోపాటు ఏటా అన్నదానమూ చేసేవారు. ఆయన చనిపోయినా కుటుంబీకులు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

Similar News

News January 17, 2026

ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. భారత్‌కు కష్టమేనా?

image

ఇరాన్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఇండియాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని యువరాజు రెజా పహ్లావి ప్రకటించారు. కానీ ఆయన తండ్రి షా మహ్మద్ గతంలో పాక్‌కు అనుకూలంగా ఉన్నారు. 1965, 1975 ఇండో-పాక్ యుద్ధాల్లో PAKకు మద్దతు తెలిపారు. ఇప్పుడు పహ్లావికి US సపోర్ట్ ఉంది. పాక్, US బంధం నేపథ్యంలో ఇరాన్ వాటికి తోడైతే మనకు కష్టమే. <<18876732>>చాబహార్ పోర్టు<<>> భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదముంది.

News January 17, 2026

కోమా నుంచి కోలుకున్నా.. మార్టిన్ ఎమోషనల్ పోస్ట్

image

కోమా నుంచి కోలుకున్న AUS మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ Xలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘DEC 27న నా జీవితం తలకిందులైంది. ఒక్క క్షణంలో లైఫ్ ఎలా మారిపోతుందో తెలిసింది. 8 రోజులు <<18765261>>కోమాలో<<>> ఉన్నా. బతికేందుకు 50-50 ఛాన్స్ ఉండగా కోమా నుంచి బయటపడ్డా. కానీ నడవలేకపోయా. ఇప్పుడు కోలుకున్నా. బీచ్‌లో నిల్చోగలిగా. సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.

News January 17, 2026

వీరు చంద్రుడిని పూజిస్తే సమస్యలన్నీ దూరం

image

మనస్సుకు కారకుడు చంద్రుడు. మానసిక ప్రశాంతత లేనివారు, అనవసర భయాలతో ఆందోళన చెందేవారు చంద్రుడిని ఆరాధించాలి. చర్మ సంబంధిత వ్యాధులు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పూజ మేలు చేస్తుంది. చంద్రుని అనుగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పౌర్ణమి రోజున ధ్యానం చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా, శారీరక మరియు మానసిక దృఢత్వం కోసం చంద్రుడిని ప్రార్థించడం ఎంతో అవసరం.