News April 24, 2024

పది ఫలితాలు.. బాలికలదే పైచేయి

image

AP: పదో తరగతి ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. బాలికలు 89.17%, బాలురు 84.32% మంది పాసైనట్లు చెప్పారు. సబ్జెక్టులవారీగా ఫస్ట్ లాంగ్వేజ్‌లో 96.47%, సెకండ్ లాంగ్వేజ్ 99.24%, థర్డ్ లాంగ్వేజ్ 98.52%, మ్యాథ్స్ 93.33%, జనరల్ సైన్స్ 91.296%, సోషల్ స్టడీస్‌లో 95.34శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.
* WAY2NEWSలో రిజల్ట్స్ చెక్ చేసుకోండి.

Similar News

News December 7, 2025

ఏడుకొండల వాడికి పుష్ప కైంకర్యం చేసిన భక్తుడు

image

శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసిన గొప్ప భక్తుడు అనంతాళ్వార్. ఈయన రామానుజాచార్యుల శిష్యుడు. గురువు ఆదేశం మేరకు తిరుమలలో స్వామివారి సేవకు పూల తోటను పెంచారు. ఓసారి స్వామివారు పిల్లవాడి రూపంలో వచ్చి ఆయనను పరీక్షించగా కోపంతో గునపం విసిరారు. అది తగిలి స్వామివారి చుబుకానికి గాయమైంది. అందుకే శ్రీవారి గడ్డంపై కర్పూరపు చుక్క పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంది. ఆ గునపాన్ని తిరుమలతో చూడవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 7, 2025

స్మృతితో పెళ్లి రద్దు.. పలాశ్ ఏమన్నారంటే?

image

స్మృతి మంధానతో పెళ్లి రద్దుపై పలాశ్ ముచ్చల్‌ SMలో పోస్ట్ పెట్టారు. ‘పర్సనల్ రిలేషన్‌షిప్ నుంచి తప్పుకుంటున్నా. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. నాపై వచ్చిన నిరాధారమైన వదంతులు బాధించాయి. గాసిప్‌ల ఆధారంగా ఎవరినీ జడ్జ్ చేయవద్దనే విషయాన్ని సమాజం నేర్చుకోవాలి. నాపై తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News December 7, 2025

ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే!

image

* పాదాలు తిమ్మిరిగా లేదా మండుతున్నట్టుగా అనిపిస్తుంది
* ఉన్నట్టుండి బాడీకి షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.
* పని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడతారు.
* అన్ని సమయాలలోనూ అలసిపోయిన భావన కలుగుతుంది.
* చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతుంటారు.
* మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లు బలహీనంగా అనిపిస్తాయి.