News April 1, 2024
మైసూరు మహారాజుకు సొంతిల్లు, కారు లేవట!

కర్ణాటకలోని మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త వడియార్ మైసూరు- కొడగు ఎంపీ స్థానంలో BJP తరఫున నామినేషన్ దాఖలు చేశారు. తన మొత్తం ఆస్తులు ₹4.99 కోట్లని వెల్లడించారు. అయితే సొంత ఇల్లు, భూమి, కారు లేవని పేర్కొన్నారు. తన భార్య త్రిషిక కుమారి పేరిట ₹1.04 కోట్లు, పిల్లల పేరిట ₹3.64 కోట్లు ఉన్నాయన్నారు. కాగా మైసూరు రాజ్యాన్ని వడియార్ ఫ్యామిలీ 1339 నుంచి 1950 వరకు పాలించింది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News February 11, 2026
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లలు, యుక్తవయస్సు వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో BP ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో BP ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి BP చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.
News February 11, 2026
పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.
News February 11, 2026
వందేమాతరం.. ఇకపై లేచి నిలబడాల్సిందే!

అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. సినిమాలు, డాక్యుమెంటరీ లేదా న్యూస్రీల్ మధ్యలో వందేమాతరం వస్తే మాత్రం థియేటర్లో నిలబడాల్సిన అవసరం లేదు.


