News April 13, 2024
హీరో ధనుశ్ తండ్రినని కోర్టుకెక్కిన వ్యక్తి మృతి

స్టార్ హీరో ధనుశ్ తన కొడుకే అంటూ 2015లో కేసు వేసిన కతిరేశన్ మృతి చెందారు. ధనుశ్ స్కూల్ నుంచి తమకు చెప్పకుండా పారిపోయి దర్శకుడు కస్తూరి రాజాకు దత్తపుత్రుడు అయ్యాడని కతిరేశన్ దంపతులు పేర్కొనడం అప్పట్లో సంచలనమైంది. ఈ విషయమై వారు కోర్టులను కూడా ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. కాగా గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కతిరేశన్ నిన్న మధురై ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు.
Similar News
News December 11, 2025
మన ఊహకందనంత శక్తిమంతుడు ‘విష్ణుమూర్తి’

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||
లోకాలన్నింటిలో అతి గొప్పవాడు, ధర్మానికి న్యాయ నిర్ణేత విష్ణు. జరిగిపోయింది, జరగాల్సిందంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. నాలుగు రూపాలుగా, నాలుగు పద్ధతుల్లో, నాలుగు భుజాలతో కనిపించే ఆయన మన ఊహకందనంత శక్తిమంతుడు. ఆ దైవాన్ని మనం మనసులో పెట్టుకొని భక్తితో ధ్యానిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 11, 2025
ఇంత గందరగోళానికి ఇండిగోనే కారణం: రామ్మోహన్

ఇండిగో విమాన సేవలు తిరిగి గాడిలో పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తలెత్తిన సంక్షోభానికి ఆ సంస్థ ‘మిస్ మేనేజ్మెంట్’ మాత్రమే కారణమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘వారి అంతర్గత సిబ్బంది రోస్టరింగ్ వ్యవస్థలో కొంత గందరగోళం నెలకొంది. FDTL మార్గదర్శకాల ప్రకారం కొత్త నిబంధనలకు అనుగుణంగా దానిని నివారించి ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు’ అని తెలిపారు.
News December 11, 2025
‘అఖండ-2’ విడుదల: దెబ్బ మీద దెబ్బ

‘అఖండ-2’ సినిమాకు వరుస అడ్డంకులు ఎదురవుతుండటం నిర్మాతలు, ఫ్యాన్స్ను కలవరపెడుతోంది. డిస్ట్రిబ్యూటర్ ఆర్థిక లావాదేవీల <<18474420>>సమస్యతో<<>> ఈ నెల 5న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజాగా ప్రీమియర్ షో టికెట్ల ధర పెంపు జీవోను TG హైకోర్టు సస్పెండ్ చేయడంతో అదనపు ఆదాయం పొందాలనుకున్న నిర్మాత ఆశలు అడుగంటాయి. కాగా ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రిఫండ్ అవుతుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.


