News April 20, 2024
ఈ తెగ ప్రజలు మొదటిసారి ఓటేశారు

దేశంలో నిన్న లోక్సభ తొలి విడత ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అండమాన్ & నికోబార్ దీవుల్లో షొంపెన్ తెగకు చెందిన ఏడుగురు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బూత్ వద్ద నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్లోనూ 56 గ్రామాల ప్రజలు మొదటిసారి ఓటు వేశారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News December 5, 2025
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
News December 5, 2025
పవనన్నకు థాంక్స్: లోకేశ్

AP: చిలకలూరిపేట ZPHSలో నిర్వహించిన మెగా PTM 3.Oకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘హైస్కూలు లైబ్రరీకి పుస్తకాలు, ర్యాక్లు, 25 కంప్యూటర్లు అందిస్తామని ప్రకటించిన పవనన్నకు ధన్యవాదాలు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా మన విద్యావ్యవస్థను 2029 నాటికి దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు Dy.CM అందిస్తున్న సహకారం చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.
News December 5, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.


