News March 7, 2025
ఫైనల్ మ్యాచ్కు పిచ్ సిద్ధం

CT-2025: ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్కు పిచ్ ఏర్పాటు పూర్తయింది. లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ ఆడిన పిచ్నే క్యూరేటర్లు తుది సమరానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ మ్యాచులో పాక్ 244 రన్స్ చేయగా భారత్ ఘన విజయం సాధించింది. ఇది వరకు భారత్ మ్యాచులన్నీ కొత్త పిచ్లపైనే ఆడగా ఫైనల్ దీనిపై ఆడనుంది. అయితే దుబాయ్లో ఆడటం ఇండియాకు కలిసి వస్తోందని పలు దేశాల క్రికెటర్లు విమర్శించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 12, 2025
నైనిటాల్ బ్యాంక్లో భారీగా ఉద్యోగాలు

<
News December 12, 2025
నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

దుబాయ్ వేదికగా నేటి నుంచి U-19 వన్డే ఆసియా కప్ జరగనుంది. గ్రూప్Aలో భారత్, పాక్, UAE, మలేసియా, గ్రూప్Bలో అఫ్గాన్, బంగ్లా, నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఇవాళ తొలి మ్యాచ్లో UAEతో భారత్ పోటీ పడనుంది. కెప్టెన్ ఆయుశ్, వైభవ్, విహాన్, వేదాంత్, దీపేశ్, కిషన్ లాంటి ప్లేయర్లతో యంగ్ ఇండియా బలంగా ఉంది. మ్యాచ్లన్నీ 10.30AM నుంచి ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్ యాప్లో వీక్షించవచ్చు.
News December 12, 2025
రోజూ 2 లీటర్లకు పైగా పాలు.. ఇదే ఈ మేక స్పెషల్

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్పూర్, అమృత్సర్, ఫిరోజ్పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి.


