News February 27, 2025
మహాకుంభమేళా ముగిసినా కొనసాగుతున్న రద్దీ

మహాకుంభమేళా ముగిసినా ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివెళ్లారు. దీంతో సంగమం ప్రాంతంలోని పలు సెక్టార్లలో భక్తులు కనిపిస్తున్నారు. నిన్నటితో కుంభమేళా ముగియగా, 45 రోజుల్లో 66.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News February 27, 2025
న్యూజిలాండ్ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం?

CT: మార్చి 2న NZతో మ్యాచులో IND కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వొచ్చని క్రీడా వర్గాలు తెలిపాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్ గిల్ కెప్టెన్సీ చేస్తారని పేర్కొన్నాయి. PAKతో మ్యాచులో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డారు. తాజాగా ప్రాక్టీస్ సెషన్లోనూ ఆయన యాక్టివ్గా పాల్గొనలేదు. దీంతో NZతో మ్యాచుకు హిట్మ్యాన్కు రెస్ట్ ఇచ్చి రాహుల్ను ఓపెనర్గా, పంత్ను WKగా ఆడిస్తారని వార్తలొస్తున్నాయి.
News February 27, 2025
జూ పార్క్ టికెట్ ధరలు భారీగా పెంపు

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.
News February 27, 2025
Breaking: వక్ఫ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

JPC రిపోర్టు ఆధారంగా సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మార్చి 10 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో దఫా సమావేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణ ఓటింగుతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజముద్ర వేస్తే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.