News May 1, 2024

రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పైనే: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేస్తానని చంద్రబాబు చెప్పారు. ‘మొన్నటి వరకు బలవంతంగా సెటిల్మెంట్లు చేసి ఆస్తులు రాయించుకున్నారు. ఇప్పుడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చారు. మీ భూమిపైన జగన్ ఫొటో ఎందుకు? మీకు జగన్ తాత భూమి ఇచ్చాడా? రేపటి నుంచి మీ భూమి.. మీది కాదు. మనందరం బానిసలుగా ఉండాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News December 14, 2025

వరించిన అదృష్టం.. డ్రాలో సర్పంచ్ పదవి

image

TG: మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. సునీత (కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి NOTAకు పడింది. ఇద్దరికీ సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.

News December 14, 2025

విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

image

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 14, 2025

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

image

AP: అనకాపల్లి సమీపంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌(BARC)ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 3వేల ఎకరాల్లో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సేకరించిన భూమిని ఆనుకొని ఉన్న 148.15 హెక్టార్ల రెవెన్యూ భూమిని తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రక్షణపరంగా విశాఖ తీరం ఈ సెంటర్ ఏర్పాటుకు అనువైనదిగా భావించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏరియాను ఎంపిక చేసింది.