News April 1, 2024
ఫోన్ ట్యాపింగ్లో పెద్ద నేతలు ఉన్నారు: ఉత్తమ్

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద నేతలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ‘నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో త్వరలోనే తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్లారు. వారి సర్కారు గొర్రెల స్కామ్ చేసింది. ఆ పార్టీ త్వరలోనే మొత్తం ఖాళీ కావడం ఖాయం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
తక్కువ ధరల్లో పశు ఔషధాలు: అచ్చెన్నాయుడు

AP: పశుపోషకులకు సబ్సిడీ ధరల్లో జనరిక్ పశు ఔషధాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘దీనికోసం పశు వైద్యశాలల ఆవరణలో 150 ఔషధ విక్రయ కేంద్రాలు పెడతాం. గొర్రెల పెంపక సహకార సంఘాలకు వీటిని అప్పగిస్తాం. ₹5.41 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలుచేస్తాం. యూనిట్ పెట్టేవారికి ప్రత్యేక సాయం కింద ₹1.5 లక్షలు అందిస్తాం. కొనుగోలుపై 20% ప్రోత్సాహకం, విక్రయాలపై 20% మార్జిన్ లభిస్తుంది’ అని మంత్రి చెప్పారు.
News February 19, 2026
వరుణ్.. నువ్వో వరం!

టీ20ల్లో టీమ్ ఇండియాకు వరుణ్ చక్రవర్తి వరంలా మారారు. గత 29 టీ20ల్లో 28 మ్యాచుల్లో అతడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక్క మ్యాచులో మాత్రమే వికెట్లు తీయలేదు. కీలక సమయాల్లో తన మిస్టరీ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం వరుణ్ స్పెషల్. ఈ ప్రపంచకప్లోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతుంటే వరుణ్ వరుసగా వికెట్లు తీస్తూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
News February 19, 2026
భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.


