News April 25, 2024

విజయవాడ ఎంపీ బరిలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు

image

AP: విజయవాడ MP స్థానానికి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు బరిలో నిలిచారు. ఇప్పటికే అన్నదమ్ములు కేశినేని నాని(YCP), కేశినేని చిన్ని(TDP).. తాజాగా కాంగ్రెస్ నుంచి వల్లూరి భార్గవ్ నామినేషన్ వేశారు. కేశినేని వెంకయ్య కుమారుడు రామస్వామి, ఆయన తనయులు కేశినేని నాని, చిన్ని. కాగా వెంకయ్య కుమార్తె వల్లూరు కుస్తూరి మనవడు భార్గవ్. అంటే వెంకయ్య మనవళ్లు నాని, చిన్ని అయితే భార్గవ్ మునిమనవడు.

Similar News

News April 14, 2026

రోబోలతోనే రష్యా స్థావరాన్ని దక్కించుకున్న ఉక్రెయిన్!

image

2022 నుంచి రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ ఇప్పుడు బరిలో రోబోలను నిలిపి మిషన్స్ చేపడుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా జవాన్లు లేకుండానే రోబోలతో ఓ రష్యా స్థావరాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. గత మూడు నెలల్లో ఈ గ్రౌండ్ వెహికల్స్ 22వేలకుపైగా మిషన్స్ చేపట్టాయని తెలిపారు. టెక్నాలజీతో ప్రాణనష్టం తగ్గించొచ్చనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

News April 14, 2026

మరోసారి తెలుగు సినిమాలో ఆలియా?

image

అందంతో పాటు విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలియా భట్. ఆమె తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే(RRR) నటించారు. త్వరలోనే మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. NTR-NEEL మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఆలియా ప్రస్తుతం ‘ఆల్ఫా’, ‘లవ్&వార్’ సినిమాల్లో నటిస్తున్నారు.

News April 14, 2026

రేవంత్ చెబుతున్న హైబ్రిడ్ నమూనా ఎక్కడా లేదు: కిషన్ రెడ్డి

image

TG: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ విధానమన్నారు. ‘రేవంత్ చెబుతున్న <<19646674>>హైబ్రిడ్ నమూనా<<>> ఎక్కడా లేదు. TGలో ఆ విధానాన్ని అమలు చేస్తే ఆదిలాబాద్‌కు సీట్లు తగ్గించి HYDకు పెంచుతారా? రాష్ట్ర ఆదాయంలో 70% HYD నుంచే వస్తోంది. అలాంటప్పుడు 70% సీట్లు HYDలోనే ఉండాలా’ అని ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు.