News May 2, 2024

విడిపోయాక దూసుకెళ్తున్నాయి..!

image

గోద్రేజ్ గ్రూప్‌ రెండుగా విడిపోతున్నట్లు ఇటీవల ఆ సంస్థ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రూప్ విడిపోయాక పలు గోద్రేజ్ కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఈరోజు వీటి షేర్ల విలువ 2-6% పెరిగింది. ఆస్టర్ లైఫ్‌సైన్సెస్ షేర్లు 6% లాభం నమోదు చేయగా గోద్రేజ్ ఆగ్రోవెట్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్ 1-4% లాభాలు నమోదు చేశాయి. అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్ల విలువ మాత్రం 3శాతం పడిపోయింది.

Similar News

News December 17, 2025

పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

image

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.

News December 17, 2025

మెస్సీ వచ్చాడు.. మంత్రి పదవి పోయింది!

image

మెస్సీ టూర్‌తో దేశంలో ఓ మంత్రి పోస్ట్ ఊస్టింగ్ అయింది. కోల్‌కతా‌లో ఫుట్‌బాల్ దిగ్గజం పర్యటన సందర్భంగా తీవ్ర <<18551215>>గందరగోళం<<>> తలెత్తిన విషయం తెలిసింది. దీంతో అందరిముందూ పరువు పోయిందంటూ బెంగాల్ CM మమత కన్నెర్రజేశారు. ఇంకేముంది ఘటనకు బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. దీన్ని ‘చాలా మంచి నిర్ణయం’ అని దీదీ పేర్కొనడం గమనార్హం. అయితే ఆయనను రాజీనామా చేయమన్నదే మేడమని మరో ప్రచారం.

News December 17, 2025

కౌలు రైతులకు రూ.లక్ష రుణం.. ఎవరు అర్హులు?

image

AP: కౌలు రైతులకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలను పొందవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించే ఈ రుణాలకు అర్హతను ఎలా నిర్ణయిస్తారు?, ఎవరికి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.