News April 29, 2024
ఈ ఎన్నికలు మా పాలనకు రెఫరెండమే: రేవంత్

తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమే అని సీఎం రేవంత్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ’14 ఎంపీ స్థానాలు గెలవాలనేది మా లక్ష్యం. 4 నెలల పాలనలో అద్భుతాలు చేయకపోయినా తప్పులు చేయలేదు. పదేళ్లు దుర్మార్గాలు చేసిన KCR.. మాపై వ్యతిరేకత వచ్చిందని, కూలగొడతాం, పడగొడతాం అని మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషం వల్లే APలో జగన్ గెలుస్తారని KCR, KTR అంటున్నారు’ అని చెప్పారు.
Similar News
News April 14, 2026
29న క్యాబినెట్ భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై చర్చ!

AP: ఈనెల 29న వెలగపూడి సచివాలయంలో CM CBN అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు ప్రతిపాదనలతో నివేదికలు పంపాలని CS అన్ని శాఖలకు సర్క్యులర్ జారీచేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, అమరావతి రెండో దశ భూ సమీకరణ, తొలిదశ సేకరించిన భూముల్లో పనుల పురోగతి, వివిధ సంస్థలకు భూముల కేటాయింపు, ఎంఓయూల మేరకు వివిధ సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.
News April 14, 2026
అరుణాచల్ ప్రదేశ్ మాదే: చైనా

అరుణాచల్ ప్రదేశ్లో <<19633032>>గ్రామాల<<>> పేర్లు మార్చడంపై భారత్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నా చైనా తగ్గడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే కాదని లేటెస్ట్గా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జియాకున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ను భారత్ అక్రమంగా ఏర్పాటు చేసుకుందని, దీనిని చైనా ఎప్పటికీ గుర్తించదన్నారు. అరుణాచల్ను జాంగ్నాన్ (దక్షిణ టిబెట్)గా పేర్కొంటూ.. ఇది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.
News April 14, 2026
వెరీ స్లో ఇన్నింగ్స్.. కోహ్లీపై చోప్రా విమర్శలు

ఈనెల 12న ముంబైతో మ్యాచులో RCB ఓపెనర్ విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించారు. ‘RCB గెలిచినప్పటికీ T20 క్రికెట్ కోణంలో చూస్తే అది చాలా స్లో ఇన్నింగ్స్. విరాట్ స్థాయికి తగ్గట్లుగా లేదు. ఆయన మైండ్సెట్ కూడా సరిగా లేనట్లు అనిపించింది. వైడ్ బాల్స్ కోసం రెండు రివ్యూలు వృథా చేశారు’ అని తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. ఈ మ్యాచులో కోహ్లీ 38 బంతుల్లో 50 రన్స్ చేశారు.


