News April 1, 2024
ఇది దేశ చరిత్రలోనే తొలిసారి: రాజ్నాథ్ సింగ్

భారతదేశ రక్షణ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే FY24లో 32.5% పెరిగాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ₹21000 కోట్ల మార్కును దాటాయన్నారు. దేశంలో తయారవుతున్న రక్షణ ఉత్పత్తులను 100+ సంస్థలు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్టార్, DPSUలతో సహా రక్షణ పరిశ్రమలన్నీ గత కొన్నేళ్లలో ప్రశంసనీయమైన పనితీరును కనబరిచాయని కొనియాడారు.
Similar News
News February 17, 2026
నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
News February 17, 2026
బిల్ గేట్స్ టూర్.. SMలో తీవ్ర విమర్శలు!

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నిన్న <<19155078>>అమరావతి<<>>లో పర్యటించడం తెలిసిందే. అయితే ఆయన భారత టూర్పై SMలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక నేరగాడు ఎప్స్టీన్ ఫైల్స్లో గేట్స్ పేరు చాలా సార్లు ఉండటమే ఇందుకు కారణం. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న అలాంటి వ్యక్తితో ఎవరూ భేటీ కాకూడదని MP కాంగ్రెస్ నేత అనూప్ ధోటే ట్వీట్ చేశారు. తన ఉత్పత్తుల కోసం ఇండియాను ల్యాబ్లా ఆయన చూస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
News February 17, 2026
లెజెండరీ నటుడు కన్నుమూత!

హాలీవుడ్ లెజెండరీ నటుడు రాబర్ట్ డువల్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన 60 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 100 చిత్రాల్లో ఆయన నటించారు. హాలీవుడ్ గ్రేట్ మూవీస్ ‘ది గాడ్ ఫాదర్’, ‘ది గాడ్ ఫాదర్-2’లో కనిపించారు. టెండర్ మెర్సీస్ సినిమాకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. మరో 6 సార్లు నామినేట్ అయ్యారు.


