News February 27, 2025
ఇంగ్లండ్ను ఓడించిన అఫ్గాన్ వెనుక మాస్టర్ మైండ్ ఈయనే..

CTలో ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ కావడం గమనార్హం. 2022లో ఆయన అఫ్గాన్ హెడ్ కోచ్గా వచ్చారు. ఆయన నేతృత్వంలోని జట్టు 2023 వన్డే WCలో PAK, ENGకు షాక్ ఇచ్చి, SL, నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. తర్వాత BANపై తొలిసారి వన్డే సిరీస్ను, PAKపై T20 సిరీస్ను గెలుచుకుంది. ఇప్పుడు CTలోనూ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Similar News
News February 27, 2025
రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.
News February 27, 2025
‘భారత్ను ఫైనల్లో ఓడిస్తామన్నావుగా.. ఇప్పుడేమైంది?’

AFG చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ క్రికెటర్ డకెట్పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల INDపై వరుసగా రెండు వన్డేలు ఓడిపోయాక డకెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం 3-0 తేడాతో ఓడినా పెద్ద మ్యాటర్ కాదు. మేం ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం. అప్పుడు ఈ ఓటమిని ఎవరూ గుర్తుంచుకోరు’ అని అన్నారు. కానీ CTలో ఇంగ్లండ్ సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.
News February 27, 2025
‘తెలుగు’కు దక్కిన గౌరవం

పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మనకు అక్కడి భాషల్లోనే నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, కుంభమేళాలో భాగంగా UPలోని చాలా ప్రాంతాల్లో తెలుగు బోర్డులు దర్శనం ఇచ్చాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో, త్రివేణీ సంగమం వద్ద, కాశీలోనూ UP ప్రభుత్వం తెలుగుభాషలో బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో AP, తెలంగాణ నుంచి వెళ్లిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం అని పలువురు గర్వపడ్డారు.