News December 17, 2024

తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్లు.. ఎప్పుడు, ఎక్కడ?

image

AP: తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండనున్నాయి. దానికి సంబంధించిన టికెట్ల వివరాలు..
*DEC 23న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు శ్రీవాణి వీఐపీ టికెట్ల విడుదల
*DEC 24న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు రూ.300 స్పెషల్ దర్శన టోకెన్ల విడుదల
*తిరుపతిలోని ఎం.ఆర్ పల్లి, జీవకోన, ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో SSD టోకెన్ల కేటాయింపు

Similar News

News January 17, 2025

బీదర్ దొంగల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట

image

<<15173290>>బీదర్ దొంగల కోసం<<>> పోలీసులు వేట కొనసాగుతోంది. నిందితులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి అడ్డదారుల్లో రాయ్‌పూర్‌కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిన్న బీదర్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎం డబ్బులు దొంగిలించిన నిందితులు సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. అఫ్జల్ గంజ్‌లో ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు.

News January 17, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’: మూడు రోజుల్లో రూ.106 కోట్లు

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేశ్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

News January 17, 2025

చైనాలో మళ్లీ తగ్గిన జనాభా.. ఆందోళన

image

జనాభాలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న చైనాలో వరుసగా మూడో ఏడాది పాపులేషన్ తగ్గింది. 2023లో 1.409 బిలియన్ల జనాభా ఉంటే 2024 చివరికి అది 1.408 బి.కు తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. 1980-2015 వరకు చైనా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ, లివింగ్ కాస్ట్ పెరగడం వల్ల జనాభా తగ్గుతున్నట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ పని చేసే వారి సంఖ్య తగ్గిపోతోందనే ఆందోళన నెలకొంది.