News March 31, 2024
ఉద్యోగులకు రేపు ఆప్షనల్ సెలవు

TG: షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఆప్షనల్ సెలవును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో మార్చి 31న సెలవును(ఇవాళ) ప్రకటించగా, తాజాగా దాన్ని సవరించింది.
Similar News
News February 12, 2026
ఆన్లైన్లో వేప పుల్లలు.. రూ.2వేల పైనే!

మన దగ్గర ఉచితంగా లభించే ఎన్నో ప్రొడక్ట్స్ను ఆన్లైన్లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తుంటాం. అందులో ‘వేప పుల్ల’ ఒకటి. అమెజాన్ వంటి షాపింగ్ సైట్స్లో 20 పుల్లలకు రూ.160వరకు ఉంటోంది. అదే అమెరికా వంటి దేశాల్లో వీటిని రూ.2వేల వరకూ విక్రయిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన జీవనశైలిలో భాగంగా చాలామంది వేపపుల్ల వైపు మళ్లుతున్నారట. వేపలోని సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్లను దృఢపరుస్తాయి.
News February 12, 2026
44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

UPSC 44 ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc (స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్), MA, MSc అర్హత గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in
News February 12, 2026
దోస పంటలో బోరాన్ లోప నివారణకు సూచనలు

దోస పంటలో బోరాన్ లోప లక్షణాలను గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవసరాన్ని బట్టి ఎకరాకు 10 కిలోల బోరాక్స్ను దుక్కిలో వేసుకోవాలి. దీని వల్ల పంటలో మగ పువ్వులు తగ్గి దిగుబడిని పెంచే ఆడ పువ్వుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల ఆశించిన దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.


