News September 13, 2025
రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

UAEలో జరుగుతోన్న ఆసియా కప్పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.
Similar News
News December 14, 2025
హిందూ ధర్మంలో ‘108’ విశిష్టత

మనం 108ని పవిత్రమైన సంఖ్యగా భావించడానికి అనేక కారణాలున్నాయి. మన హిందూ ధర్మంలో ఈ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవతలకు నామాలు, శివుడికి అనుచరులు, కృష్ణుడి బృందావనంలో పూల సంఖ్య నూట ఎనిమిదే. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యచంద్రుల వ్యాసానికి 108 రెట్లు వాటికి భూమికి మధ్య దూరం ఉంటుంది. మనవ శరీరంలో కూడా మనం దృష్టి సారించాల్సిన చక్రాలు 108 ఉంటాయి. జపమాలలోనూ ఇన్నే పూసలుంటాయి.
News December 14, 2025
CSIR-CECRIలో ఉద్యోగాలు

చెన్నైలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CECRI)12 పోస్టులను భర్తీ చేయనుంది. Sr.ప్రాజెక్ట్ అసోసియేట్, Sr.రీసెర్చ్ ఫెల్లో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు DEC 24న ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BE, బీటెక్, ME, ఎంటెక్ , MSc(కెమిస్ట్రీ), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.cecri.res.in/
News December 14, 2025
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు: నాగబాబు

AP: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నటుడు, MLC నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం(D) లావేరులో జరిగిన జనసేన మీటింగ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘MLAగా పోటీ చేయాలనుకుంటే వచ్చే ఎన్నికల వరకు ఎందుకు? గత ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని. 5-6 ఏళ్ల తర్వాత సంగతి చెప్పమంటే ఏం చెబుతాం. జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే సంతృప్తి ఉంటుంది’ అని తెలిపారు.


