News April 1, 2024
TPT: ఐజర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

తిరుపతి IISERలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్-ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ), బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సంబంధిత ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఇతర వివరాలకు www.iiseradmissiఓn.in వెబ్సైట్ చూడాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 13.
Similar News
News February 11, 2026
చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS)లో టీచర్లు నమోదు చేసిన తప్పుల సవరణకు విద్యాశాఖ అనుమతించిందని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. టీచర్లు వారి వ్యక్తిగత వివరాలను పరిశీలించి ఏవైనా తప్పులుంటే తగిన ఆధారాలతో ఈనెల 14వ తేదీలోపు డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీఐఎస్ డేటాలో హెచ్ఎంలు, టీచర్లు తప్పుడు సమాచారం పొందుపరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 11, 2026
చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
News February 11, 2026
వెల్ఫేర్ హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలి: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జాయింట్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. బృంద సభ్యులు ప్రతిరోజు హాస్టల్స్ తనిఖీ చేసి నివేదికలను తనకు అందజేయాలని సూచించారు. హాస్టల్స్లో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు వస్తే వార్డెన్పై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సంక్రమణ వ్యాధులు సోకకుండా చూడాలన్నారు.


