News September 11, 2025
TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణు నియామకం

TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ దేవాదాయశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎం హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. వీరిలో సభ్యునిగా బాధ్యత తీసుకోని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు స్థానంలో తాజాగా సుదర్శన్ వేణును నియమించారు. సభ్యుడి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే సుదర్శన్ వేణు పదవిలో ఉంటారని పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
శ్రీకాకుళం: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్కు కష్టమౌతోంది.
News December 12, 2025
కృష్ణా: ప్రియుడి మృతితో యువతి సూసైడ్

సూర్యారావుపేటకు చెందిన లోహిత (22) కంకిపాడులోని పిన్ని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారం క్రితం తను ప్రేమించిన అబ్బాయి చనిపోవడంతో, లోహిత తీవ్ర మానసిక వేదనకు గురైందని బంధువులు తెలిపారు. ఉదయం లేచేసరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 12, 2025
VZM: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్కు కష్టమౌతోంది.


