News August 5, 2024
TU: పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ సెమిస్టర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు పొడిగించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని పలు పీజీ కోర్సుల 2వ, 8వ రెగ్యులర్ సెమిస్టర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య అరుణ తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 12వరకు, రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 14వరకు చెల్లించవచ్చన్నారు.
Similar News
News December 16, 2025
NZB: బాలుడి విక్రయం కలకలం.. తల్లితో సహా ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో 2 నెలల బాలుడి విక్రయం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వారికి రూ.2.40 లక్షలకు కన్న బిడ్డను తల్లి లక్ష్మీ హైదరాబాద్లో అమ్మగా పోలీసులకు బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లితో సహా విఠల్, రమాదేవి అనే ముగ్గురిని 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News December 16, 2025
NZB: తుది దశ ఎన్నికలకు రంగం సిద్ధం

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్ కు అధికారులు రంగం సిద్ధం చేశారు. మూడో విడుత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జర గనుంది. తుది విడుత పోలింగ్లో ఉన్న మొత్తం సర్పంచ్ స్థానాలు 165 కాగా ఇందులో 19 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు.
News December 15, 2025
NZB: ముగిసిన 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం

నిజామాబాద్ జిల్లాలో 3వ విడతలో 12 మండలాల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం
సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలో గల గ్రామాలలో బుధవారం పోలింగ్ జరుగనుంది


