News January 27, 2025

ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చిన UCC

image

దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) అమలులోకి వచ్చింది. రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘యూసీసీతో సమాజంలో అనేక విషయాల్లో అసమానతలు తొలగుతాయి. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. కాగా.. ఇది ఏకాభిప్రాయం లేని ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

Similar News

News February 7, 2025

రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

image

ఈనెల 26న శివరాత్రి కావడంతో స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఉంది. అలాగే పలు జిల్లాల్లో 27న కూడా సెలవు ఉండనుంది. ఆరోజు TGలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ MLC, APలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానాలకు పోలింగ్ జరగనుంది. APలో శ్రీకాకుళం, విజయనగరం, VZG, ఉ.గోదావరి, కృష్ణా, GTR, TGలో MDK, NZB, ADB, KNR, WGL, KMM, NLGలో టీచర్లు ఓటు వేయనుండటంతో అక్కడ స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

News February 7, 2025

ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

image

TG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అనారోగ్యం లేదా అత్యవసర కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాని వారికి మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విద్యార్థులు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని సంప్రదించాలని సూచించింది. ఈనెల 22తో ఇంటర్ ప్రాక్టికల్స్ ముగియనున్నాయి.

News February 7, 2025

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. BJPకే జైకొట్టిన మరో 2 సంస్థలు

image

ఢిల్లీలో ఈసారి BJP తిరుగులేని విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. నిన్న రాత్రి సర్వే ఫలితాలు వెల్లడించిన టుడేస్ చాణక్య, CNX కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. ఆ పార్టీ 51 సీట్లు గెలిచే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేయగా, 49-61 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని CNX పేర్కొంది. కాగా BJP 45-55 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని నిన్న సాయంత్రం మై యాక్సిస్ ఇండియా తెలిపింది.

error: Content is protected !!