News April 14, 2024

అకాల వర్షాలతో రైతులకు దెబ్బ

image

TG: అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచుతున్నాయి. నిన్న నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దీంతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు పలు చోట్ల మార్కెట్ యార్డుల్లో షెడ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పలు చోట్ల మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 14, 2025

INDvsSA.. గెలుపు ఎవరిదో?

image

టీ20 సిరీస్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో చెరో విజయంతో ఇరు జట్ల ఫోకస్ ఈ మ్యాచ్ నెగ్గడంపైనే ఉంది. రెండో T20లో నెగ్గిన సఫారీ ప్లేయర్లు అదే జోష్‌లో ఉన్నారు. అటు ఓటమితో కంగుతిన్న టీమ్ ఇండియా ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మ్యాచ్ 7pm నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News December 14, 2025

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

image

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <>Xలో<<>> దుయ్యబట్టింది. ‘గత రెండేళ్లలో రాష్ట్రంలో 828 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 117 మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందిపడ్డారు’ అని రాసుకొచ్చింది. రాష్ట్ర ప్రజలు మీ మోసాన్ని గుర్తుంచుకుంటారని పేర్కొంది.

News December 14, 2025

కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

image

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.