News September 13, 2025
భారత్పై సుంకాలు విధించాలని G7, EUకి US రిక్వెస్ట్!

రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్, చైనాపై సుంకాలు విధించాలని G7 దేశాలు, EUను US కోరినట్లు రాయిటర్స్ తెలిపింది. G7 ఫైనాన్స్ మినిస్టర్ల మధ్య జరిగిన ఫోన్ కాల్లో దీనిపై చర్చ జరిగినట్లు పేర్కొంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని వారు చర్చించినట్లు తెలిపింది. ఫ్రీజ్ చేసిన రష్యా అసెట్స్ను వినియోగించుకుని, ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకూ అంగీకరించారని వెల్లడించింది.
Similar News
News December 5, 2025
ఇండిగో ఎఫెక్ట్.. డీజీసీఏ కీలక నిర్ణయం

ఇండిగో సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధుల విషయంలో విధించిన <<18475795>>ఆంక్షలను <<>>ఎత్తివేసింది. సిబ్బంది వారాంతపు విశ్రాంతి సెలవుల నిబంధనను తొలగించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. పలు విమానయాన సంస్థల వినతి మేరకు చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో ఫ్లైట్ల సర్వీసులు తిరిగి యథావిధిగా ప్రారంభం కానున్నాయి.
News December 5, 2025
‘హిల్ట్’పై హైకోర్టులో విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

TG: <<18450502>>హిల్ట్<<>> పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ చీఫ్ KA పాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీనిపై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
News December 5, 2025
కూరగాయల పంటల్లో వైరస్ తెగుళ్లు ఎలా వ్యాపిస్తాయి?

కూరగాయల పంటలకు రసం పీల్చే పురుగుల ముప్పు ఎక్కువ. ఇవి వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. ఈ తెగుళ్లతో 25-75% వరకు పంట నష్టం జరుగుతుంది. వైరస్ సోకిన మొక్కలను రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే, వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీర భాగాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల రసం పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల నుంచి వైరస్లు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తాయి.


