News April 2, 2024
ట్విటర్ ట్రెండింగ్లో ‘వడాపావ్’

రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం పొందింది. సొంత గడ్డపై ముంబై ప్లేయర్లు డకౌట్ అవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కువ సార్లు జీరో డిజిట్కే వెనుదిరగడంతో ‘వడాపావ్’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వరుసగా ఓడిపోతున్నప్పటికీ ప్లేయర్లు గెలవాలన్న కసితో ఆడట్లేదని విమర్శిస్తున్నారు. దీంతో ‘వడాపావ్’ హాష్ట్యాగ్ ట్విటర్లో ట్రెండవుతోంది.
Similar News
News February 17, 2026
కనిపించిన నెలవంక.. రేపటి నుంచే రంజాన్

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు. రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే.
News February 17, 2026
బంగ్లా క్యాబినెట్లో ఏకైక హిందూ మంత్రి.. నితాయ్ రాయ్ చౌధరీ!

బంగ్లా కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ మంత్రివర్గంలో హిందూ సామాజిక వర్గానికి చెందిన నితాయ్ రాయ్ చౌధరీకి స్థానం దక్కింది. ఆయన సాంస్కృతిక శాఖ బాధ్యతలు చేపట్టారు. మాగురా-2 నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన రాయ్ వృత్తిరీత్యా లాయర్. BNP వైస్ ఛైర్మన్లలో ఒకరు. 1990లో హుస్సేన్ ఎర్షద్ ప్రభుత్వంలోనూ మంత్రిగా చేశారు. హిందువులపై దాడుల నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయన చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
News February 17, 2026
పాకిస్థాన్కు ‘రావి’ షాక్: ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!

వేసవి వేళ పాక్కు భారత్ షాకివ్వనుంది. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి పాక్కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు JK మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్కే పూర్తి హక్కులు ఉన్నా ఇన్నాళ్లూ ప్రాజెక్టుల్లేక నీరు వృథాగా పాక్కు వెళ్లేది. ఇకపై ఆ నీటితో JK, పంజాబ్లకు సాగునీరు అందనుంది.


