News March 28, 2024
ఆదాయంలో విజయవాడ రైల్వే డివిజన్ రికార్డు

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా ₹3,975 కోట్ల రాబడి సాధించి విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2018-19లో ₹3,875 కోట్ల ఆదాయం సాధించగా, ఇప్పుడు ఆ రికార్డు బ్రేకయ్యింది. సరకు రవాణాలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా 19.36 మి.టన్నుల బొగ్గు, 6.68 మి.టన్నుల ఎరువులను రవాణా చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News February 19, 2026
విశాఖలో AI హబ్: సుందర్ పిచాయ్

ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్లో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో గూగుల్ AI హబ్లను ఏర్పాటు చేస్తోందని కంపెనీ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. మానవాళికి AI చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ AIని చాలా వేగంగా అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీని అందరికీ చేర్చడమే మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
News February 19, 2026
163 ఏళ్ల తర్వాత ఇలా.. మళ్లీ 2189లోనే!

ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల పండుగలు ఒకే సమయంలో రావడం చాలా అరుదు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్, క్రైస్తవ మతంలో ఈస్టర్ పండుగకు ముందు వచ్చే లెంట్, చైనీస్ ‘లూనార్ న్యూఇయర్’లు 1863లో 24 గంటల వ్యవధిలోనే ప్రారంభమయ్యాయి. మళ్లీ 163 ఏళ్ల తర్వాత 2026లో ఈనెల 17-18న ఇది ఆవిష్కృతమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మళ్లీ ఇలాంటి వింతను చూడాలంటే 2189 వరకు వేచి చూడాలి.
News February 19, 2026
ట్రంప్ ఆదేశమే ఆలస్యం.. ఇరాన్పై దాడికి US ఆర్మీ సిద్ధం: CNN

ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికా మిలిటరీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వీకెండ్లోనే అటాక్ చేసే ఛాన్స్ ఉందని CNN తెలిపింది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్లో US తన అతిపెద్ద ఎయిర్ పవర్ను మోహరించినట్లు పేర్కొంది. ట్రంప్ తన అడ్వైజర్లతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్గా ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


