News May 13, 2024
VIRAL: అవును.. ఇదీ పోలింగ్ కేంద్రమే

తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, నాగర్కర్నూల్ జిల్లాలోని రాయలేటి పెంటలో ఓ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంది. అక్కడి పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఓ పూరి గుడిసెను సహాయక పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. చెంచు గిరిజన ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటిఫుల్ కేంద్రాన్ని మీరూ చూసేయండి.
Similar News
News December 15, 2025
ఒకే రోజు రెండుసార్లు పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ <<18569611>>ఉదయం<<>> నుంచి రెండుసార్లు బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,470 పెరిగి రూ.1,35,380కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,940 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,24,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 15, 2025
ధరలు మార్చకుండా ప్రయోజనాలు తగ్గించిన AIRTEL

ఎయిర్టెల్ తన అన్లిమిటెడ్ 5G బూస్టర్ ప్యాక్ల డేటా ప్రయోజనాలను గణనీయంగా తగ్గించింది. ₹51, ₹101, ₹151 ప్యాక్లపై గతంలో లభించిన 3GB, 6GB,9GB డేటా ఇప్పుడు 1GB, 2GB,3GBకు తగ్గించింది. ధరలు మారనప్పటికీ డేటా తగ్గడంతో వినియోగదారులకు నష్టం కలగనుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ప్యాక్ల ప్రయోజనాలనూ ఇలానే తగ్గించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
News December 15, 2025
మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.


