News September 11, 2025

VKB: ‘పశువులకు అందుబాటులో మందులు’

image

జిల్లాలో పశువులకు ఎలాంటి వ్యాధులు ప్రబలిన మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశువైద్యాధికారి సదానందం తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో పశువుల మందులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పశువులకు ఎలాంటి వ్యాధులు సోకిన చికిత్సలు అందించి మందులు అందిస్తామన్నారు. సబ్సిడీపై 75% గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Similar News

News December 8, 2025

శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

image

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.

News December 8, 2025

జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్‌‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.

News December 8, 2025

జగిత్యాల: బస్సు ఛార్జీలు ఇస్తాం.. వచ్చి ఓటేయండి

image

జగిత్యాల జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటు అభ్యర్థులకు కీలకం కావడంతో ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాలలో ఉంటే వారికి ఫోన్లు చేసి గ్రామానికి వచ్చి తనకు ఓటు వేసి వెళ్తే బస్సు ఛార్జీలు ఇస్తామని, వచ్చి ఓటేయండని ప్రాధేయపడుతున్నారు. దీంతో వస్తామని కొందరు, ఒక్క ఓటు కోసం ఏం వస్తాంలే అని మరికొందరంటున్నారు.