News August 3, 2024
Wayanad Landslide: ఎకో సెన్సిటివ్ జోన్గా 57వేల SqKM

పశ్చిమ కనుమల్లో 56825 SqKM ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా (ESA) ప్రతిపాదిస్తూ కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. <<13762066>>వయనాడ్<<>> జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డ నూల్పుళ సహా కేరళలో 9993 SqKM దీని పరిధిలోకి వస్తుంది. జులై 30న విపత్తు ప్రభావానికి లోనైన ముండక్కై, చూరల్మల, అట్టామల పేర్లు డ్రాఫ్ట్లో లేవు. కాగా శనివారం ఉదయానికి వయనాడ్ మరణాల సంఖ్య 344 దాటేసింది. చాలామంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
రేపే మూడో విడత ఎన్నికల పోలింగ్

TG: రేపు 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,410 వార్డు మెంబర్ల స్థానాలకు 75,725 మంది బరిలో నిలిచారు.
News December 16, 2025
ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలపై సభాసంఘం

AP: ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పీకర్ ఏడుగురు MLAలతో సభాసంఘాన్ని నియమించారు. ఇందులో N.అమర్నాథ్ రెడ్డి ఛైర్మన్గా K.రవికుమార్, D.నరేంద్ర, B.శ్రీనివాస్, Y.వెంకట్రావు, B.రామాంజనేయులు, శ్రావణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులను అసెంబ్లీ సహాయ కార్యదర్శికి నేరుగా లేదా ‘apl.apcob@gmail.com’కి మెయిల్ పంపవచ్చని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.
News December 16, 2025
CLAT-2026 ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. <


